సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ఆగ్నేయం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతోనే నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో వారం రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోత తప్పడం లేదు. శుక్రవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 41శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.