సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా గురువారం ప్రకటించారు. పర్యావరణ స్థిరత్వం కోసం ప్రజలను ప్రోత్సహించడంతోపాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా లాంగ్ జర్నీ చేసేందుకు వీలుంటుందని నిరూపించేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ఆగస్టు 15న మాత్రమే ఆఫర్ను ఉపయోగించుకోవాలని సూచించింది. https://nuego.in/booking వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.