సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ మెడలో ప్రభుత్వం పచ్చలహారం వేసింది. ఎటుచూసినా పచ్చని చెట్లు, పారులతో హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ను హరితమయం చేసి.. 158 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్, నెక్లెస్ రోడ్తో సహా 39 అర్బన్ పారులను అర్బన్ లంగ్ స్పేస్లుగా అభివృద్ధి చేశారు. తద్వారా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) అర్బన్ డే ఫౌండేషన్ 2020, 2021లలో హైదరాబాద్కు “ట్రీ సిటీ అవార్డు” అందించింది. ఈ క్రమంలోనే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం దేశంలో ఒక దశాబ్దంలో 48.66 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యధిక గ్రీన్ కవర్ను పొందిన మెగా నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో 4.50 కోట్ల మొక్కలు
సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలులో హెచ్ఎండీఏ ముందున్నది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 2022-23 సీజన్లో రూ.298.09 కోట్లతో తెలంగాణలో హరితహారం కింద 4 కోట్ల 50 లక్షల మొకలు నాటినట్లు బుధవారం అధికారులు పేర్కొన్నారు. 71.15లక్షల మొకలను నాటి ఓఆర్ఆర్ (158కి.మీ.), ఇంటర్ చేంజ్లు (457.23 ఎకరాలు), సర్వీస్ రోడ్డు, రైల్వే కారిడార్లు మొదలైన వాటితో పాటు ఇంటెన్సివ్ ప్లాంటేషన్ ద్వారా గ్రీన్ కారిడార్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మొకలకు నీరందించేందుకు ఓఆర్ఆర్లో బిందు సేద్యం పరికరాలు అమర్చారు.
డ్రిప్ ఇరిగేషన్తో రూ.5.9కోట్లు ఆదా
బిందు సేద్యం పరికరాలు స్కాడా సాఫ్ట్ వేర్ ఆధారిత ఆటోమేషన్పై పని చేస్తున్నాయి. దీంతో ఓఆర్ఆర్లో డ్రిప్ ఇరిగేషన్కు రూ.5.09 కోట్లు ఆదా అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రూ.116 కోట్ల 62 లక్షల వ్యయంతో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 14708.24 ఎకరాల విస్తీర్ణంలో 16 ఫారెస్ట్ బ్లాక్ లలో “అర్బన్ లంగ్ స్పేసెస్”గా గ్రీనరీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ 16 రిజర్వ్ ఫారెస్ట్ పారులలో ఆరు పారులను ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఆర్అండ్బీ రోడ్లు, హెచ్ఎండీఏ రోడ్ల వెంట సెంట్రల్ మీడియన్ – మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్లు 672.5 కిమీలు, అవెన్యూ ప్లాంటేషన్లు 269.8 కిమీలు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2022-23 సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5కోట్ల మొకలను 42 నర్సరీలలో పెంచామని, హెచ్ఎండీఏకు చెందిన తెల్లాపూర్ నర్సరీ రాష్ట్రంలోనే ఉత్తమ నర్సరీలలో ఒకటిగా గుర్తింపు పొందిందని అధికారులు వివరించారు.