జిల్లా కార్యవర్గాన్ని అభినందించిన జిల్లా కలెక్టర్
సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): విశిష్ట సేవలు అందించింనందుకు జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా రెడ్క్రాస్ సొసైటీ జనరల్ బాడీ (2019-20, 2020-21, 2021-22) వార్షిక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
కొవిడ్ సందర్భంగా రెడ్ క్రాస్ అందించిన సేవలు మరువలేనివన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడారన్నారు. ఈ విధంగా భవిష్యత్తులో కూడా తమ కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికల్లో సిట్టింగ్ అధ్యక్షుడు భీమిరెడ్డి ఏకగ్రీవంగా అదే పోస్టుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ.వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత, సొసైటీ సభ్యులు రాధాకృష్ణ, విజయ్కాంత్, నిర్మల, విజయ భాస్కర్ పాల్గొన్నారు.