హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని ఓయో రూమ్స్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రూమ్స్ల్లో ప్రయివేటు పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించాని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బషీర్ బాగ్లోని సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓయో రూమ్స్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి అని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఓయో సెంటర్ వద్ద సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచాలన్నారు. 6 నెలల స్టోరేజీని తప్పనిసరిగా భద్రపరచాలని ఆదేశించారు. ఓయో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ కార్డుతో పాటు ఇతర వివరాలను కచ్చితంగా నోట్ చేసుకోవాలని సీపీ సూచించారు.