మన్సూరాబాద్, మార్చి 1: అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 17న జరిగిన నేనావత్ నవీన్ (20) హత్య కేసులో లోతైన విచారణ చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ తెలిపారు. బుధవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… నేనావత్ నవీన్ను చంపిన నిందితుడు హరిహర కృష్ణను కస్టడీకి తీసుకునేందుకు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు.
సదరు పిటిషన్పై గురువారం కోర్టులో హియరింగ్కు వస్తుందన్నారు. కస్టడీకి అనుమతి వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. నిందితుడి స్నేహితులపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.