ఉప్పల్, డిసెంబర్ 12 : ఉప్పల్ క్రైస్తవుల శ్మశానవాటికలకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఉప్పల్ భగాయత్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ను చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్మశానవాటికలు లేకపోవడంతో క్రైస్తవులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి స్థలం కేటాయించాలన్నారు. వీరికి మోడల్ శ్మశానవాటిక నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎల్బీనగర్లో నిర్మాణం చేపట్టిన వాటిలో తాత్కా లికంగా వారికి అనుమతి ఇచ్చేవిధంగా చూడాలన్నారు. ఈ కార్య క్రమంలో నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండల్రెడ్డి, జగన్, అల్లిబిల్లి మహేందర్, రవీందర్గౌడ్, పుష్పరాజ్, తదితరులు పాల్గొన్నారు.
అలాగే.. ఉప్పల్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధులు.. క్రైస్తవుల సమాధుల కోసం స్థలం కేటాయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోరారు. ఈమేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు. క్రైస్తవుల సమస్యలు గుర్తించి, పరిష్కరించేవిధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెరుషలేము మత్తయ్య, జోసెఫిన్, గోన ఫిలిఫ్, ఏనోషు బాబు, అసోసియేషన్ ప్రతినిధులు, పాల్గొన్నారు.