హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో చేపట్టిన ఆందోళనలతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి హైదరాబాద్లో మెట్రో రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మెట్రో సర్వీసులను పునరుద్ధరించారు.
#Hyderabad Metro Trains Back On Tracks! pic.twitter.com/7ZSGtZ4cBs
— Hi Hyderabad (@HiHyderabad) June 17, 2022