హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు రాత్రికి ఇండియా – ఆస్ట్రేలియా జట్ల టీ20 మ్యాచ్ జరగనుంది. క్రికెట్ వీక్షించేందుకు వచ్చే జనాలను దృష్టిలో ఉంచుకొని, రేపు రాత్రికి మెట్రో రైళ్ల సేవలను పొడిగించారు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు కేవలం ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలోనే ప్రయాణికులను ఎక్కేందుకు అనుమతి ఇవ్వనున్నారు. మిగతా స్టేషన్లలో ప్రయాణికులకు అనుమతి ఇవ్వరు. ఇక ఏ స్టేషన్లోనైనా దిగేందుకు అవకాశం కల్పించారు. అయితే రాత్రి సమయంలో ప్రయాణించాలనుకునే వారు మ్యాచ్కు వెళ్లే ముందే టికెట్లను కొనుగోలు చేయాలని సూచించారు.