హైదరాబాద్: మెట్రో సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 18 నుంచి మళ్లీ మెట్రో సువర్ణ ఆఫర్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రోలో నెలకు 20 ట్రిప్పులు, ఆ పైన తిరిగేవారికి లక్కీ డ్రా నిర్వహిస్తారు.
డ్రాలో గెలిచిన విజేతలు 20 ట్రిప్పులు ప్రయాణించే ధరతో 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. ఈ నిర్ణయం పట్ల మెట్రో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.