సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. నగరంలో గరిష్ఠం 33.5, కనిష్ఠం 24.4 డిగ్రీలు, గాలిలో తేమ 52 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.