హైదరాబాద్లో దారుణం జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను ఓ వ్యక్తి కోశాడు.
వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడకు చెందిన ఓ మహిళ (50) భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత నవీన్ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతనితో సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రేక్తుడైన నవీన్.. చాకుతో మహిళ నాలుక కోసి పారిపోయాడు.
ఇది గమనించి స్థానికులు బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటోందది. కాగా, బాధితురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.