హైదరాబాద్ : బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి జీహెచ్ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భారీగా జరిమానా విధించారు. అయితే ఆ ఆస్పత్రి సిబ్బంది ఓ పేషెంట్ అటెండర్ బైక్కు పార్కింగ్ ఫీజు కింద రూ. 20 విధించారు.
పార్కింగ్ ఫీజులను ప్రభుత్వం 2018లోనే నియంత్రించిన నేపథ్యంలో ఆ ఆస్పత్రి సిబ్బంది వసూలు చేయడాన్ని సదరు వ్యక్తి తప్పుబట్టాడు. పార్కింగ్ ఫీజు రశీదుతో పాటు ఇతర ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందజేశాడు. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి.. ఆ ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధించింది.