సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ చేపడుతున్న బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు అనుకూలంగా మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్ట్ ఫేజ్-3, రింగ్ మెయిన్-1కి చెందిన 1500 ఎంఎం వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్పై జంక్షన్ పని చేపట్టనున్నారు. ప్రతిపాదిత బాక్స్ డ్రెయిన్ అలైన్మెంట్లో ఈ ప్రధాన పైప్ లైన్ ఉండటంతో, డ్రెయిన్ నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు జంక్షన్ పని చేపట్టడం అవసరమైంది. ఈ పనులు శనివారం ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు చేపట్టనున్నారు.
ఈ 24 గంటలు కృష్ణా ఫేజ్-3, రింగ్ మెయిన్-1 పరిధిలోని కొన్ని రిజర్వాయర్ కమాండింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్తో నీటిసరఫరా జరిగే అవకాశం ఉంది. శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, దుర్గానగర్, సులేమాన్ నగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్ పూర్, 9 నంబర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్ననగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, షేక్ పేట్ రిజర్వాయర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.ss