బాలానగర్, డిసెంబర్ 20 : అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం సమప్రాధాన్యతనిస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ మల్లికార్జున కాలనీలోని కార్పొరేటర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేటర్ నర్సింహయాదవ్తో కలిసి క్రైస్తవులకు ప్రభుత్వం అందజేసిన కానుకలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల మతాలకు అతీతంగా పండుగలకు కానుకలు అందజేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పాస్టర్ సుధాకర్, నాయకులు నరేందర్గౌడ్, కర్రె జంగయ్య, బల్వంత్రెడ్డి, సయ్యద్ ఎజాజ్, లావణ్య, మక్కల నర్సింగ్, ఇర్ఫాన్, హరినాథ్, నర్సింగ్రావు, యాదగిరి, మట్టి శ్రీను, ఉదయరాణి, సరోజ, లలిత పాల్గొన్నారు.
బాలానగర్లో..
ప్రభుత్వమే అధికారికంగా క్రిస్మస్ కానుకలు అందజేయడం హర్షణీయమని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని రాజుకాలనీలో క్రైస్తవులకు ప్రభుత్వం అందించిన కానులకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్లు ప్రసాద్, స్వామి, చిన్న రాజు, ఇమాన్యుయల్, జేర్మియరాజు, అలెక్స్, స్టాన్లీ, రత్నం, ఖాజ, సుజాతగౌడ్, కవిత, మధులత, కృష్ణమూర్తి, శ్రీనివాస్ ముదిరాజ్, నాగేందర్గౌడ్, ప్రేంకుమార్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫతేనగర్లో..
ఫతేనగర్ డివిజన్లో కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ క్రిస్మస్ కానుకలు క్రైస్తవులకు పంపిణీ చేశారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్ పరిధి గౌతంనగర్లో పాస్టర్స్ ఫెలోషిప్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి కార్పొరేటర్ సతీశ్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాస్టర్స్తో కలిసి క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్ డేవిడ్ పాల్గొన్నారు.