మూసాపేట, డిసెంబర్9: కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధి టీచర్స్కాలనీలో రూ.30లక్షలు, అస్మత్పేట ఎస్సీ బస్తీలో రూ.23 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ ముద్దం నర్సింహాయాదవ్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే వివరించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పురాతన కాలంనాటి డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ వ్యవస్థాలను ఆధునికరించడం జరిగిందన్నారు.
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసిన ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. నర్సింహాయాదవ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణలతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని కాంట్రక్టర్లను కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ బాలకృష్ణ, ఏఈ అరవింద్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, డివిజన్ సెక్రటరి హరినాథ్, వార్డు కమిటీ సభ్యుడు నర్సింగ్రావు, కాలనీ అధ్యక్షుడు ఎల్లయ్య, శ్రీనివాస్రావు, జనార్దన్, భాస్కర్రావు, వెంకటేశ్వరావు, రామారావు, సాయిరెడ్డి, సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి మాజీ కౌన్సిలర్లు కర్రే లావణ్య, మక్కల నర్సింగ్రావు పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎం రిలీఫ్ఫండ్
కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 9 : అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసానిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫతేనగర్ డివిజన్కు చెందిన షాహీన్కు రూ.2.50 లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కృష్ణారావు అందజేశారు.