మణికొండ/శంషాబాద్ రూరల్/బండ్లగూడ/మైలార్దేవ్పల్లి/అత్తాపూర్/వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 9 : తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బుద్దోలు శ్రీరాములు, పార్టీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. అదేవిధంగా నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నార్సింగి, కోకాపేట, మంచిరేవుల గ్రామాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు.
శంషాబాద్ మండలంలోని 27 గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, జడ్పీటీసీ తన్విరాజు, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్లు ప్రజలను పెద్ద ఎత్తున తరలించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండిగోపాల్యాదవ్లతో పాటు ఆయా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు.
బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు,ప్రజలు భారీగా తరలి వెళ్లారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సభ నిర్వహించడంతో నాయకులు, కార్యాకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ ఆధ్వర్యంలో బాబుల్రెడ్డినగర్ , గణేశ్నగర్, ఉడంగడ్డ,పద్మశాలిపురం, లక్ష్మీగూడ ,మధుబన్ కాలనీల నుంచి మహిళలు,యువకులు సభ ప్రాంగణానికి పాదయాత్రగా బయలుదేరారు. డివిజన్ మాజీ అధ్యక్షుడు సరికొండ వెంకటేశ్ ,రఘుయాదవ్ ,అడికె అర్జున్, మసున వెంకటేశ్, డీవీ కుమార్ ,నాని, ఎల్లప్ప తదితరులు ఉన్నారు.
అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభకు డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, మహిళలు ర్యాలీగా తరలివెళ్లారు. జిల్లా నాయకులు సురేందర్రెడ్డి, అమరేందర్, సురేశ్రెడ్డి, చిన్నా, సుభాశ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, మహేశ్, కపిల్, శంకర్, కృష్ణ, మల్లేశ్ పాల్గొన్నారు.
రాజేంద్ర నగర్ పరిధిలోని సులేమాన్ నగర్ డివిజన్ చింతల్ మేట్ నుంచి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు షేక్ నయీమొద్దీన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. షేక్ బాబా, ఎండీ హుస్సేన్, ఫయాజ్ ఖాన్, సనామేడం, భాను మేడం, సురేశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.