ఆర్కేపురం, డిసెంబర్ 5 : డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోలీసు ఉద్యోగ నియామకానికి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు పారదర్శంగా జరుగుతాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్సింగ్, అడిషనల్ డీసీపీ సమీర్, అడ్మిన్ అడిషనల్ డీసీపీ నర్మద, ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.