చర్లపల్లి, నవంబర్ 28 : అన్ని వర్గాల ప్రజల సంక్షే మం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ధోబీఘాట్లో సుమారు రూ.52లక్షలతో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్ర ధోబీఘాట్ యూనిట్లను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులవృత్తుల వారిని గుర్తించి, వారి సంక్షేమం కోసం సీఎం కేసీ ఆర్ కృషి చేస్తున్నారని, ముఖ్యంగా వారికి సంక్షేమ ఫలా లు అందించేందుకు నిధులు కేటాయించారన్నారు. గతంలో కుషాయిగూడ ధోబీఘాట్కు ఎంపీ ఫండ్స్ కింద రూ.15లక్షల నిధులు షెడ్ నిర్మాణంకోసం కేటా యించామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడాలేవని, బంగారు తెలంగాణ సాధిం చే దిశగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ధోబీఘాట్ల ఆధునీకరణకు కృషి : ఎమ్మెల్యే
నియోజకవర్గ పరిధిలోని ధోబీఘాట్లను ఆధునీకరించేందుకు చర్య లు తీసుకుంటామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కుషాయిగూడ ధోబీఘాట్లో రజకుల సౌకర్యార్థం అదనంగా భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభు త్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ప్రసంగించారు. అంతకుముందు ధోబీఘాట్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి ఝాన్సీరాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్గౌడ్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, ఎస్సైలు సాయికుమార్, ఉపేందర్యాదవ్, రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి అధ్యక్షుడు అక్కిరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పెద్దాపురం కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, చల్లా వీరేశం, కుషాయిగూడ ధోబీఘాట్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్, నాయకులు జనుం పల్లి వెంకటేశ్వ్రెడ్డి, సుధాకర్, ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్ల అధ్యక్షులు కాసం మహిపాల్రెడ్డి, డప్పు గిరిబాబు, జాండ్ల ప్రభాకర్రెడ్డి, చల్లా ప్రభాకర్, గంప కృష్ణ, పద్మారెడ్డి, శోభ, దుర్గా, వినోద్, వెంకటరమ ణ, సత్యనారాయణ, రాకేశ్, వెంకటేశ్, చంద్రమౌళి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.