బంజారాహిల్స్,నవంబర్ 23: తెలంగాణ ప్రజల ఆకలితీరుస్తూ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ పేదల ఇంటికి పెద్ద కొడుకులా ఆసరా కల్పిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. షేక్పేట మండల పరిధిలోని వెంకటేశ్వరకాలనీ డివిజన్లో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి చేతులమీదుగా నిర్వహించారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1830మందికి ఆసరా గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇటీవల బీజేపీ నాయకులు గాలి మాటలు మాట్లాడుతూ, మతాల మధ్య చిచ్చు పెట్టి అబద్దాలతో పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఆసరా పథకం కింద అర్హులందరికీ పింఛన్లు ఇస్తామన్నారు.త్వరలో దళితబంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆసరా కార్డులు అందుకున్న వారికి ఎమ్మెల్యే దానం ఆధ్వర్యంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షేక్పేట మండల తహసీల్దార్ రామకృష్ణనాయక్, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, టీఆర్ఎస్ నాయకులు రాంచందర్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు యెండూరి మాధవి, ఎస్ఎమ్.జావెద్, ఆంథోనీ, అశ్వక్, మాదాస్ ఆనంద్కుమార్, గణేష్, నల్ల శివ తదితరులు పాల్గొన్నారు.
జీవితాంతం రుణపడి ఉంటా
కష్టపడి ఇన్నాళ్లూ సెంట్రింగ్ పనులు చేసుకుని కుటుంబాన్ని నడిపించాను. పిల్లలను పెంచి పెద్దచేశాను. ఇప్పుడు ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలు బాగానే చూసుకుంటున్నారు. అయితే నాకు మందులు కావాల్సినా, చిన్న చిన్న అవసరాలు వచ్చినా పిల్లలను అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. రెండు నెలల క్రితం ఆసరా పింఛన్ మంజూరు అయింది. వృద్ధులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– మొయినుద్దీన్ అన్సారీ. సింగాడకుంట