హైదరాబాద్, నవంబర్ 22 (సమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మంత్రి మహమూద్ అలీ, నగర ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 27న జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ సురభివాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నియోజకవర్గ ఇన్చార్జిలు ఆనంద్గౌడ్, సలావుద్దీన్లోది, ప్రేమ్సింగ్ రాథోడ్, నందు బిలాల్, శ్యామ్ సుందర్రెడ్డి, జీవన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.