కొండాపూర్, నవంబర్ 22 : ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అసవరమైన ప్రాంతాల్లో లింక్ రోడ్ల ఏర్పాట్లకు చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ గంగారం హనుమాన్ దేవాలయ సమీపంలోని జాతీయ రహదారి (ఎన్హెచ్ -65) నుంచి అపర్ణ అపార్టెంట్ వరకు చేపట్టనున్న లింక్ రోడ్డు ప్రాంతాలను టౌన్ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. గంగారం గ్రామస్తులు, హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులతో పాటు అపర్ణ, పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక లింక్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
హనుమాన్ దేవాలయం సమీపంలో జాతీయ రహదారికి కలిసేలా అపర్ణ అపార్ట్మెంట్ వరకు ఇన్ అండ్ ఔట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా గంగారం – అపర్ణ అపార్ట్మెంట్ల మధ్య లింక్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, టీపీఎస్ రవీందర్, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, గంగారం గ్రామ కమిటీ సభ్యులు, హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు దొంతి శేఖర్, రాజేందర్, బుజేందర్, రాజు, గోపి, తులసీదాస్, అశోక్, రవికుమార్, రాజేశ్, చిన్న, వీరేందర్ పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి అందజేత..
మియాపూర్: హఫీజ్పేట్ డివిజన్ జనప్రియ అపార్టుమెంట్కు చెందిన లీల కృష్ణకు సీఎం సహాయనిధి పథకం కింద రూ.2.50 లక్షల ఆర్థిక సాయం నిధుల మంజూరు పత్రాలను బాధిత కుటుంబానికి విప్ తన నివాసంలో అందించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్యాదవ్, గౌతంగౌడ్, కాశీనాథ్యాదవ్ పాల్గొన్నారు.