సైదాబాద్, ఆగస్టు 24 : ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్లు కొత్త శోభ సంతరించుకోన్నాయి. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో పూర్తిగా దెబ్బతిని గుంతలుగా మారిన రోడ్ల స్థానంలో కొత్తగా బీటీ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈక్రమంలో అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. వర్షాకాలంలో రోడ్లపై ఏర్పడే గుంతల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రధాన, అంతర్గత రోడ్లను ఆధునీకరించే క్రమంలో కొత్తగా బీటీ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. రోడ్లతోపాటు, సామాజిక భవనాల నిర్మాణాలు, పార్క్ల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇందిరా సేవాసదన్ డివిజన్లో దెబ్బతిన బీటీ రోడ్ల స్థానంలో కొత్తగా సీసీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తయారు చేశారు. పుట్పాత్ అభివృద్ధి సంబంధించిన పనులు కార్యరూపం దాల్చనున్నాయి. మూడు కోట్ల 50 లక్షల వ్యయంతో పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ మేరకు టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులను మొదలు పెట్టనున్నారు. డివిజన్ పరిధిలో ఇప్పటికే పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్వర్క్ పూర్తి చేశామని అధికారులు తెలిపారు. పూర్తిగా దెబ్బతిన రోడ్లకు బీటీ స్థానంలో సీసీ రోడ్డు వేయనున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నది. పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్లను పూర్తి చేశాం. కాలనీల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్స్, ఫుట్పాత్లు, పార్క్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వివరాలు ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులను మొదలు పెడుతాం
– మహ్మద్ అన్సారీ, ఏఈ, సంతోష్నగర్ సర్కిల్