మేడ్చల్, జనవరి 3(నమస్తే తెలంగాణ): రైతు బంధు వారోత్సవాలు మేడ్చల్ జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు రైతులు, టీఆర్ఎస్ శ్రేణు లు సన్నద్ధం అవుతున్నారు. వ్యవసాయ సాగుకు పెట్టుబడిగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ను రైతుల పక్షాన నిలిచినట్లు అయ్యిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున రైతుబంధు వారోత్సవాలను నిర్వహించనున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 61 గ్రామ పంచాయతీలలో అనేక కార్యక్రమా లు జరగనున్నాయి. ఈ నెల 6,7వ తేదీలలో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు, 8,9,10వ తేదీలలో ముంగిళ్లలో ముగ్గుల పోటీలు, భారీ ఎత్తున బండ్ల ఉరేగింపులు, రైతు వేదికలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రైతులందరూ రైతుబంధు వారోత్సవాలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వ్యసాయాన్ని పండుగలా మా ర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలిచేందుకు అధిక సంఖ్యలో రైతులు అందరు పాల్గొననున్నట్టు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు 28,704 మంది రైతుల ఖాతాలలో 17 కోట్ల 47 లక్షలు జమ అయ్యాయి. మొత్తం 42445 రైతులు ఉండగా రూ.39 కోట్ల 52 లక్షలను ఈ నెల 10వ తేదీ వరకు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
విజయవంతం చేస్తాం
రైతుబంధు వారోత్సవాలను విజయంతం చేస్తాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా రైతుబంధు వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 61 గ్రామ పంచాయతీలలో రైతుబంధు వారోత్సవాలలో భాగంగా బండ్లతో ఉరేగింపు కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుతో రైతులందరూ సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ వారోత్సవాలలో పాల్గొంటారు. రైతులందరూ వారోత్సవాలలో పాల్గొనేందుకు ఉత్సహం చూపుతున్నారు.
కుత్బుల్లాపూర్లో సంబురాలు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రైతుబంధు సంబురాలు సోమవారం ప్రారంభమయ్యా యి. రైతుల కోసం ఆర్థికంగా అందజేస్తున్న సాయం నిధులను విడుదల చేయడంతో రై తుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యం లో సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండి మైసమ్మ-దుండిగల్ మండలం, బౌరంపేటలో రైతులు, రైతు సమితి నేతలు సంబురాలు జరుపుకున్నారు. బౌరంపేటలో ని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం (పీఏసీఎస్) కార్యాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం, పలువురు రైతు లు, నేతలు ‘సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి’ అని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘రైతుబంధు’ పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ గోపాల్రెడ్డి, దుండిగల్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు మద్దికుంట సంజీవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి క్రిష్ణ, డైరెక్టర్లు భీంరెడ్డి, వీరేశం గౌడ్, గోపాల్ రెడ్డి, ఆకుల యాదయ్య, హరగోపాల్, పోలీస్ లక్ష్మారెడ్డి, బెంబడి బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, న ర్సారెడ్డి, ఈశ్వరయ్యల రైతులు పాల్గొన్నారు.
శామీర్పేటలో క్షీరాభిషేకం
రైతాంగానికే వన్నె తెచ్చే సంక్షేమ, అభివృ ద్ధి కార్యక్రమాలతో రైతు బాంధువుడుగా ము ఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నాడని రైతులు అన్నారు. రైతుబంధు నిధులు జమ అవుతు న్న నేపథ్యంలో సోమవారం మండల కేం ద్రం శామీర్పేట ప్రధాన చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఐలయ్య యాదవ్, భూమిరెడ్డి, సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ డప్పు సాయిబాబు, అఫ్జల్ఖాన్, చాంద్పాషా, న ర్సింహారెడ్డి, ఇర్షాన్, ఆంజనేయులు, పవన్ ముదిరాజ్, గౌస్, విష్ణు, నిస్సార్, మధు, అనిల్ పాల్గొన్నారు.