హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారి కుటుంబంలో ఒకరికి పొరుగు సేవల విభాగంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తాం. బాలిక కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.