అబిడ్స్, ఏప్రిల్ 20: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
గన్ఫౌండ్రి డివిజన్ పరిధిలోని బిర్లా మందిర్ తదితర ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర చేసి ఇంటింటి ప్రచారం చేశారు. కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి అభివృద్ధి కోసం పాటు పడే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.