Auto Driver | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. తమ బతుకులు రోడ్డున పడ్డాయని.. తమను ఆదుకోవాలని కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుతో కడుపు తరుక్కుపోయిన ఓ ఆటో డ్రైవర్.. తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన బతుకు బండిని నడిపించే ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు.
గురువారం సాయంత్రం ప్రజాభవన్ వద్దకు వచ్చిన ఓ ఆటో డ్రైవర్.. తన ఆటోను తగులబెట్టాడు. అక్కడే ఆందోళన చేపట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. సదరు ఆటో డ్రైవర్ను మహబూబ్నగర్కు చెందిన దేవ్లా (45)గా పోలీసులు గుర్తించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కిరాయిలు దొరక్కపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. అందుకే నిరసనగా తన ఆటోను తగులబెట్టినట్టుగా దేవ్లా వెల్లడించాడు.
ప్రజా భవన్ ముందు ఆటో తగలబెట్టుకున్న ఆటో డ్రైవర్ pic.twitter.com/NTE09zw90N
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2024