హైదరాబాద్ : బాచుపల్లిలో(Bachupally) దారుణ చోటు చేసుకుంది. భార్యను భర్త కత్తితో చంపిన(Brutal murder) సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సాయి అనురాగ్ కాలనీలో నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి తన భార్య మధులతను కత్తితో పొడిచి(Husband stabs wife) చంపాడు. మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసేందుకు ప్రయత్నించగా విఫలమైంది.
దీంతీ గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇవేవి ఫలించకపోవడంతో చివరికి తాను కత్తితో కోసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈ నెల 5న జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.