హైదరాబాద్: నగరంలోని జియాగూడలో దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు భర్త. జియాగూడకు చెందిన సరిత, సంతోష్ భార్యాభర్తలు. భార్యపై అనుమానం పెంచుకున్న సంతోష్ గత కొంతకాలంగా ఆమెతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమెను కత్తితో పొడిచి హత్యచేశారు. అడ్డొచ్చిన సరిత బంధువుపై కూడా సంతోష్ దాడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కత్తి దాడిలో గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితుడు సంతోష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.