Hyderabad | అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్తకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2018 కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
2018లో భవానీ నగర్ పీఎస్ పరిధిలో నివాసం ఉండే ఇంజామ్ హక్ తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు. అదనపు కట్నం కోసమే తన భార్యను ఇంజామ్ హత్య చేశాడని తేలడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్ కోర్టు.. తాజాగా నిందితుడికి ఉరిశిక్ష విధించింది.