హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్లో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై (PV Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పిల్లనర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాదంతో ఉప్పర్పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.