హైదరాబాద్ : డ్రగ్స్ కట్టడిలో పోలీసులు దూకుడు పెంచారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate)పరిధిలో భారీగా డ్రగ్స్ను(Huge drugs) ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల ఓపియం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను ఎల్బీ నగర్(LB Nagar) ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి కంటైనర్, 8 బైకులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్కు బానిసలై జీవితాల్ని నాశనం చేసుకొద్దని పోలీసులు యువతకు సూచించారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.