సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): అర్హులైన పౌరులను ఓటరు జాబితాలో ఎలా చేర్చుకోవాలి, ఆన్లైన్లో ఓటరుగా ఎలా లెక్కించాలి తదితర అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రోస్, సర్పరాజ్తో పాటు గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో చర్చించారు.
శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధానంగా ఓటరు నమోదు ప్రక్రియలో తలెత్తే సమస్యలు, కొత్త వారిని ఓటరు జాబితాలో చేర్చడం, ఓటర్ల లెక్కింపు తదితర అంశాలపై మాట్లాడారు.