బండ్లగూడ, మార్చి 29 : పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ మండల కార్యాలయంలో బుధవారం తాసీల్దార్ చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, 58 ,59 జీవోల, అర్హులైన 49మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 31మందికి కల్యాణలక్ష్మి, 379 మందికి షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదలకు పథకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. రాజేంద్రనగర్లో ఇప్పటి వరకు 2,328 షాదీ ముబారక్, కల్యాణలక్ష్మిచెక్కులను అందజేశామని అన్నారు. తాసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దలారులను నమ్మవద్దని, నేరుగా మీసేవకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అర్చన జయప్రకాశ్, సంగీతగౌరీశంకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సారిక, స్థానిక నాయకులు రాపోలు సత్తయ్య, ధర్మారెడ్డి, శ్రావణ్కుమార్, ప్రేమ్గౌడ్, రాజేశ్యాదవ్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి అందరూ సహకరించాలి..
నియోజకవర్గ అభివృద్ధి పజాప్రతినిధులు, నాయకులు సహకరించాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మహేందర్గౌడ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా 2023-24 బడ్జెట్కు రూ.64 కోట్ల 36లక్షల బడ్జెట్ అంచనాలను రూపొందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందని తెలిపారు. సమస్యలు ఎమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.