Home Voting | సిటీబ్యూరో, మే 2 ( నమస్తే తెలంగాణ ) : ఎన్నికల సిబ్బంది నేడు, రేపు హోం ఓటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 86 మంది సీనియర్స్ సిటిజన్స్, 35 మంది దివ్యాంగులు ఉన్నారు.
శుక్ర, శనివారం ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హోం ఓటింగ్ ఉంటుంది. ఓటర్లకు ఫోన్ చేసి.. వారు అందుబాటులో ఉన్న సమయంలో ఎన్నికల సిబ్బంది బృందాలుగా సంబంధిత ఓటర్ల వద్దకు వెళ్లి..హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. కాగా, ఓటర్లు అందరూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి చెప్పారు.