హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులపాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సెలవులను రద్దు చేస్తు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీచేశారు. ఈరోజుల్లో కార్యాలయాలను యథావిధిగా నడపాలని పేర్కొన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు, ప్రారంభోత్సవాలు ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం ఫారుక్నగర్ బస్డిపో వద్ద సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. ఎంజీబీఎస్- ఫలక్నుమా మధ్యలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. దారుల్షిఫా నుంచి ఆలియాబాద్ మీదుగా సాగే ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా వద్ద 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి. మొదటి దశలో జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు చేపట్టిన మెట్రో ఎంజీబీఎస్ వరకే పరిమితమైన విషయం తెలిసిందే.