HMDA | హైదరాబాద్ : కోకాపేట నియో పోలిస్ భూములు అమ్ముడుపోయిన మాదిరిగానే.. మోకిల్లా ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారిడార్కు సమీపంలోని మోకిల్లాలో మొదటి దశలో 50 ప్లాట్లను హెచ్ఎండీఏ సోమవారం వేలం వేసింది. ఈ ప్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ. 121.40 కోట్ల ఆదాయం వచ్చింది. 50 ప్లాట్ల వేలంతో రూ. 40 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాకు మూడు రెట్లు అధికంగా ఆదాయం సమకూరింది. మోకిల్లాలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ. 1.05 లక్షలు పలికింది. చదరపు గజం ధర కనిష్ఠంగా రూ. 72 వేలు పలికింది. సగటున రూ. 80,397 పలికింది.
ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న మోకిలలో హెచ్ఎండీఏ మొత్తం 165 ఎకరాల్లో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తోంది. శంకర్పల్లి – మెహిదీపట్నం రోడ్డు నుంచి 2 కి.మీ లోపలికి ఉన్న ఈ లేఅవుట్లో మొదటి దశలో 50 ప్లాట్లను విక్రయిస్తే విశేష స్పందన రావడంతో వెంటనే రెండో దశ వేలంను త్వరలోనే నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన షెడ్యూలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. మొదటి దశ వేలం 50 ప్లాట్ల విస్తీర్ణం (15800 గజాలు) విక్రయించామని, కనీస మద్దతు ధరను రూ.25 వేలు నిర్ణయిస్తే మూడు రెట్లు అధికంగా పలికిందని, ఇది హెచ్ఎండీఏ చేస్తున్న అభివృద్ధి పట్ల ఉన్న నమ్మకంతోనేని అధికారులు తెలిపారు.