హైదరాబాద్: నగర శివార్లలోని బహదూర్పల్లి, తొర్రూరులో హెచ్ఎండీఏ (HMDA) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్ల ఈ-వేలం (E-auction) కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూరులో 30 ఎకరాల్లో ఉన్న 223 ప్లాట్లు, బహదూర్పల్లిలోని 40 ఎకరాల్లో ఉన్న 101 ప్లాట్లకు సోమవారం ఉదయం 9 గంటలకు అధికారులు ఈ-వేలం ప్రారంభించారు. బహదూర్పల్లిలో సాయంత్రం 5 గంటలకు ఈ-వేలం పాట ప్రారంభంకానుంది. కాగా, తొర్రూరులో చదరపు గజం రూ.20 వేలు, బహదూర్పల్లిలో చదరపు గజం రూ.25 వేల నుంచి ఆన్లైన్ వేలం ప్రారంభమైంది. వేలం ప్రక్రియ ఈనెల 17 వరకు కొనసాగనుంది.
ప్లాట్ల విక్రయాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ ఈ-యాక్షన్ ద్వారా విక్రయించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండీఏ చేపట్టిన తరహాలోనే పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు.