హైదరాబాద్: హైదరాబాద్ శివారల్లోని హయత్నగర్లో (Hayathnagar) దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ (Drunk and drive) ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. పవన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం తాగుతూ అతివేగంగా కారు నడిపి యాక్సిడెంట్ చేశారు. దీంతో కృష్ణారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. అయితే వ్యక్తి మరణానికి కారణమైన పవన్.. కారును ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించారు. టీఎస్08ఈజెడ్6717 అనే తెలుపు రంగులో ఉన్న బెంజ్ (Benz car) కారుతో కృష్ణా రెడ్డి ఢీకొట్టారని అధికారులు వెల్లడించారు. వారాల స్వేతారెడ్డి పేరుతో కారు నమోదై ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ (Hit and Run) కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.