Hit and Run Case | హిట్ అండ్ రన్ కేసులో టీటీడీ బోర్డ్ మెంబర్, పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. సందీప్ను అరెస్ట్ చేసిన పోలీసులు రాయదుర్గం పీఎస్కు తరలించారు. రాయదుర్గం పీఎస్లో సందీప్ ఓ చైర్లో కూర్చున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సందీప్ గంజాయి మత్తులో మునిగి తేలుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సందీప్ గంజాయి సేవిస్తూ మత్తును ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్కు చెందిన నందులాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ మెయిన్ రోడ్డు మార్గంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సందీప్ అతివేగంగా నడుపుతూ వచ్చిన కారు రోడ్డు దాటుతున్న నందులాల్ను తీవ్రంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న నందులాల్ను కాపాడేందుకు జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి స్పందించి, తన కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ మార్గంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సందీప్ కారును మరో మహీంద్రా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ అనూహ్య పరిణామాల మధ్య గాయపడిన నందులాల్ మృతి చెందాడు. ప్రమాదానికి పాల్పడిన తర్వాత వెనుక నుంచి ఢీకొట్టిన మహీంద్రా కారు ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిపుణుల సాయంతో ప్రమాదానికి కారణమైన సందీప్ కారుతోపాటు, దానిని ఢీకొట్టి వెళ్లిపోయిన మహీంద్రా కారును గుర్తించారు.
గంజాయి మత్తులో TTD బోర్డు మెంబర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణం బలిగొన్న సందీప్
హిట్ అండ్ రన్ కేసులో ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు అదుపులో సందీప్ https://t.co/dd16qGwkJk pic.twitter.com/96pzCyxtXB
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Jailer 2 | జైలర్ 2’ రిలీజ్పై క్లారిటీ.. ఆ డేట్కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!
ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు
ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు తెలంగాణ ఆత్మ గౌరవం : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్