సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 దిగుడు బావులను పునరుద్ధరించే ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ఇప్పటికే దాదాపు 12 చోట్ల పూర్వ వైభవాన్ని సంతరింపజేశారు.
బాపూఘాట్, గచ్చిబౌలి, గుడి మల్కాపూర్, శివంబాగ్, బన్సీలాల్పేట, సీతారాంబాగ్లో పరిరక్షణ చర్యలు చేపట్టగా, ఇటీవల కుతుబ్షాహి టూంబ్స్లోని ఆరు మెట్ల బావులను పునరుద్ధరించారు. ఆగాఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడీ బౌలి, పశ్చిమ బౌలి, హమామ్ బౌలి, ఈద్గా బౌలి, ఈస్టర్న్ బౌలి, బాగ్ బౌలిని అందంగా తీర్చిదిద్దారు. ఈ ఏడాది వర్షాకాలంలో 20వేల మిలియన్ లీటర్లకు పైగా నీరు సేకరించి వాటిని దాదాపు 10వేల మొక్కలకు ఈ నీటిని వాడుతున్నారు.
బడి బౌలి
బాపూఘాట్లో..
గచ్చిబౌలిలో..
హమామ్ బౌలి