శంషాబాద్ రూరల్, డిసెంబర్ 25 : ఎయిర్పోర్టులో 48 గ్రాముల హెరాయిన్ను పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ ఆర్జీఐఏ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్ అలీమ్ ఖాద్రీ క్యాబ్ డ్రైవర్. ఈజీగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో హెరాయిన్ సరఫరా ముఠాతో చేతులు కలిపాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే హెరాయిన్ను ముంబైకి చెందిన సాజన్కు అందజేస్తున్నాడు.
పక్కా సమాచారంతో మాదాపూర్ జోన్ ఎస్వోటీ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించి, 48 గ్రాములు హెరాయిన్తోపాటు రూ.2500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు అరెస్టు కాగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ ముఠాకు సంబంధించిన మిగతా నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పట్టుబడిన హెరాయిన్ రూ. 50వేలకు పైగా ఉంటుందని వివరించారు.