Traffic Jam | హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో నగరంలోని పలు బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు వెలిశాయి. క్రమంలో పెట్రోల్, డీజిల్ కోసం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వేలాది వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. పెట్రోల్ బంకుల ఎదుట వాహనాలు భారీగా బారులు తీరారు. ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఖైరతాబాద్ – లక్డీకపూల్ మార్గంలో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెహదీపట్నం – లక్డీకపూల్ మార్గంలోనూ వాహనాలు స్తంభించాయి. పంజాగుట్ట – బేగంపేట మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. పంజాగుట్ట వంతెనపై నెమ్మదిగా వాహనాలు సాగుతున్నాయి. బంజారాహిల్స్, కూకట్పల్లితో పాటు పలు మార్గాల్లోనూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇదిలా ఉండగా.. హిట్ అండ్ రన్ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. కొత్త నిబంధనలు వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఆయిల్ ట్యాంకుల డ్రైవర్ల ధర్నాతో బంకుల వద్ద ఇంధన సరఫరా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఇంధన ట్యాంకర్లు, ట్రక్కుల డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో బంకుల ఎదుట నోస్టాక్ బోర్డులు వెలిశాయి. కొరత వస్తుందనే భయంతో బంకులకు క్యూటిన వాహనదారులు క్యూకట్టారు. హైదరాబాద్తో చాలా రాష్ట్రాల్లో ఇంధన కొరత ఎదురవుతున్నది.