హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని బీహెచ్ఈఎల్, మియాపూర్ ఏరియాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వరకు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత రెండు గంటల నుంచి వాహనాలు ముందుకు కదలడం లేదు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నిస్తున్నారు.
ఇక ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బంజారాహిల్స్, మణికొండ, ఖాజాగూడ, షేక్పేట, టోలిచౌకీ, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట, సనత్ నగర్, బాలానగర్, రాజేంద్ర నగర్, కిస్మత్పురా, బండ్లగూడ జాగీర్, గండిపేట్, పుప్పాలగూడ, అత్తాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.