సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శనివారం సైతం భారీ వర్షం పడింది. గాజులరామారంలో అత్యధికంగా 4.4సెం.మీల వర్షపాతం నమోదైంది.
పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వానలు కురిశాయి. రాగల మరో రెండు రోజులు సైతం ఇలాగే వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గ్రేటర్కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.