సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.2డిగ్రీలు, గాలిలో తేమ 22 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.