మేడ్చల్ కలెక్టరేట్/కీసర, జనవరి 5 : నియోజక వర్గంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. నాగారం, దమ్మాయిగూడల్లో శుక్రవారం భారీగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. తాసీల్దార్ అశోక్ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో నాగారం రెవెన్యూ పరిధిలోని 83 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో వెలిసిన 15 ఇండ్లను నేలమట్టం చేశారు. అదేవిధంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కుందన్పల్లి రెవెన్యూ పరిధిలోని 152, 153 సర్వే నెంబర్లలోని 17 ఇం డ్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా తాసీల్దార్ అశోక్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ భూ ముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ కిశోర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కీసర తాసీల్దార్ అశోక్కుమార్ హెచ్చరించారు. మండలంలోని చీర్యాల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 224లో అక్రమంగా నిర్మించిన 15 ఇండ్లను రెవెన్యూ అధికారులు శుక్రవారం జేసీబీతో కూల్చివేయించారు. ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదన్నారు.