మలక్పేట, మే 10: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారని ఆ విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం దిల్సుఖ్నగర్లోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రిలియంట్ విద్యాసంస్థల నుంచి 1890 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా…1871 మంది ఉత్తమ శ్రేణిలో పాసయ్యారని తెలిపారు. 117 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా, 612 మందికి ఏ గ్రేడ్, 408 మంది విద్యార్థులు ఏ2 గ్రేడ్ పాయింట్లు సాధించారని, 99 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 37 సంవత్సరాలుగా తమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల డైరెక్టర్ జెవిఎన్.ప్రసాదరావు, ప్రిన్సిపాల్ వేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.