సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): పుస్తక నేస్తాల కోసం సందర్శకులు క్యూ కడుతున్నారు. ఐదోరోజు పుస్తక పండుగలో సందర్శకులతో స్టాల్స్ కళకళలాడాయి. సాహితీ ప్రియులు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) తొవ్వతొక్కి తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. పుస్తక వేడుకకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై పలు పుస్తకాల స్టాళ్లను సందర్శించారు. పుస్తక పండుగ ప్రాంగణంలోని అలిశెట్టి ప్రభాకర్ వేదికపై చర్చాగోష్ఠిలతో పాటు పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
వేల ఏండ్లనాడే చైతన్య దృక్పథాన్నిబుద్ధుడు బోధించాడు: కోయి కోటేశ్వర్రావు
చైతన్య దృక్పథాన్ని బుద్ధుడు వేల ఏండ్లనాడే దేశానికి తెలియజెప్పారని సిటీ కళాశాల అధ్యాపకుడు కవి, రచయిత కోయి కోటేశ్వర్రావు అన్నారు. తుమ్మ భాసర్ రచించిన ప్రేమ మృదంగం పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో కలిసి ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. విధ్వంసక, వినాశక, కుల తత్వం, మత తత్వంతో కూడిన విధానలతో సమాజాన్ని చీల్చే వారిని కవిత్వంతో తుమ్మ భాస్కర్ చీల్చి చెండాడారని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా హేతబద్ధ ఆలోచనతో సమాజ పురోగమనానికి దోహదపడుతున్నాయని చెప్పారు. తుమ్మ భాసర్ జీవితం, అయన రచనలు హేతుబద్ధంగా సమాజాన్ని చైతన్యవంతం చేయడం అభినందనీయమని అన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, అన్నిరంగాల్లో తెలంగాణ ముందుకు వెళ్లాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. పుస్తకం మంచి స్నేహితుడి కన్నా ఎకువేనని, అద్వానీ తన ప్రయాణంలో కూడా పుస్తకాలు చదివేవారని గుర్తు చేశారు. పుస్తకాలు విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంచేలా ఉండాలని అన్నారు. ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పుస్తకాలు చదవాలన్నారు. తనను విజయ రామారావు భాగవతం చదవమని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. రామాయణం, మహాభారతం మన దేశానికి గొప్ప సందేశాలను ఇస్తున్నాయని, వాటిని పఠించాలని సూచించారు. పుస్తకాన్ని కొనుకొని చదివితే దాని విలువ తెలుస్తుందని చెప్పారు. బుక్ ఫెయిర్లో తెలంగాణ సాహిత్య అకాడమీ స్టాల్, మన ముఖ్యమంత్రి స్టాల్తోపాటు ప్రభుత్వ స్టాల్స్ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ స్టాల్స్ను పరిచయం చేశారు.
నెనరు తెలంగాణ కథ 2021 పుస్తకావిషరణ
డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వెల్దండి శ్రీధర్ సంపాదకత్వంలో ప్రచురించిన నెనరు తెలంగాణ కథ 2021 పుస్తకాన్ని ప్రముఖ కథకులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆవిషరించారు. ఈ సందర్భంగా రఘోత్తమరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెనరులో వెల్దండి శ్రీధర్ కథ కూడా ఉందన్నారు. శ్రీధర్ తన కథా రచనలను మరిన్ని రాయాలని కోరారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. కరోనాతో ప్రజల్లో నెనరు మరింత అవసరం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథకులు సమ్మెట ఉమాదేవి పుస్తక పరిచయం చేశారు. కవి, విమర్శకులు, డాక్టర్ యాకూబ్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురసార గ్రహీత డాక్టర్ గడ్డం మోహన్రావు, కథకులు డాక్టర్ కాలువ మల్లయ్య, పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్నారు.
గ్రామర్తో పనిలేకుండా ఇంగ్లిష్
జె.ఎస్. అరవింద్ రచించిన మాట్లాడటం ఎలా..? 7 స్టెప్స్ టు లర్న్ ఈసిలీ స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ ఆవిషరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లిష్ అంటే మనలో చాలా భయం ఉంటుందన్నారు. కానీ, అది సులభమైన భాష అన్నారు. మాతృభాష సరిగా వస్తే ఆంగ్లం మాట్లాడటం చాలా ఈజీ అన్నారు. ఈ పుస్తకం ప్రతి సూల్కు చేరే విధంగా చూడాలని రచయిత జేఎస్. అరవింద్కు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్ర మోహన్ పాల్గొన్నారు.