మాదాపూర్, ఆగస్టు 20 : అతివేగంగా.. నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన జనసేన నేత కుమారుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద లైఫ్ైస్టెల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) సహోద్యోగి పూజా అశోక్తో కలిసి ఐటీసి కోహినూర్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా నిర్లక్ష్యంతో అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో భారతి ముఖికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. బాధితురాలి మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఏపీకి చెందిన ఎంపీ, జనసేన పార్టీ నాయకుడి కుమారుడు లింగమనేని సంజు అని తేలింది. దీంతో పోలీసులు అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.